కొండ బాపూజి జయంతి వేడుకలు

Published: Tuesday September 28, 2021
బాలాపూర్, సెప్టెంబర్27, ప్రజాపాలన ప్రతినిధి : ప్రజలకు సేవ చేసిన కొండ బాపూజి ఎందరికో ఆదర్శం అని కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో కొండా బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేయర్, డిప్యూటీ మేయర్ లతో పాటు కార్పొరేటర్లు, కార్పొరేషన్ వివిధ శాఖ అధికారులు కొండ బాపూజి చిత్రపటానికి పూలమాల వేసినివాళులర్పించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.... స్వాత్రంత్ర ఉద్యమం, తెలంగాణా రాష్ట్ర తొలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి నిజామ్ రజకర్లకు వ్యతిరేకంగా యుద్ధం చేసిన పొరటయోధుడు అని అన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యే గా మంత్రిగా ప్రజలకు సేవ చేసిన కొండ బాపూజీ, ప్రజల్లో ఆయన ఎందరికో ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, లిక్కి మమతా కృష్ణ రెడ్డి, డీఈఈ అశోక్ రెడ్డి, ఏఈఈ బిక్కు నాయక్, ఆర్వో చంద్ర శేఖర్ రెడ్డి, కార్యలయ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.