ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం

Published: Saturday November 19, 2022
మేడిపల్లి, నవంబర్ 18 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వరావు  నివాసంలో  ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం కనుల పండువగా జరిగింది. అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నగర  మేయర్ గద్వాల విజయలక్ష్మీ, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, 
కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, స్వర్ణ రాజ్, బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ,మాజీ కార్పొరేటర్లు గొల్లురి అంజయ్య ,మేకల హన్మంతు రెడ్డి ,టీఆర్ఎస్ నాయకులు నందికొండ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు,భక్తులు,నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.