ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు

Published: Wednesday June 29, 2022

బోనకల్, జూన్ 28 ప్రజాపాలన ప్రతినిధి: 2022 మే లో జరిగినటువంటి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు . ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 89 మంది పరీక్షకు హాజరు కాగా 75 మంది ఉత్తీర్ణత సాధించారు. 84.26% రాగ. మొదటి సంవత్సరం విద్యార్థులు 112 మందికి గాను 79 మంది ఉత్తీర్ణత సాధించినారు.  70.5 %    నీతి సంవత్సర ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థు పి. పూజిత  946 , ఎం. శైలజ 929, బి. సతీష్ 924, మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఎంపీసీ గ్రూప్ నందు జి .నీలిమ 465/470, బి. సుమాంజలి 464/470, ఎం. సాయి సిద్ధార్థ 461/470,460/470, బై పి సి గ్రూప్ నందు ఎస్.కె .షాహీన్ 427/440, పి .హేమలత 416/440, ఎం .మహిత 411/440, హెచ్ఎసి గ్రూపు నందు బి .ఝాన్సీ 420/500, జి. సాయి 412/500. కళాశాలతో మంచి ఫలితాలు సాధించేందుకు గాను విద్యార్థినీ విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ నళిని శ్రీ , అధ్యాపక అధ్యాపకతల సిబ్బంది అభినందనలు తెలియజేశారు.