పల్లె ప్రగతిలో హరితహారం

Published: Tuesday July 06, 2021
గుమ్మడిదల, జులై 05, ప్రజాపాలన ప్రతినిధి : గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి, వీరన్నగూడెం గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా హరితహారం కార్యక్రమం చెప్పటారు, అందులో భాగంగా ఎంపీపీ సద్ది ప్రవీణ, జడ్పిటిసి కుమార్ గౌడ్, స్పెషల్ ఆఫీసర్ ప్రసాద్, ఎంపిడిఓ చంద్రశేఖర్, ఆయా గ్రామ సర్పంచులుతో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు, ఈ కార్యక్రమంలో ఎంపీఓ దయాకర్ రావు, గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శి లు, నాయకులు సద్ది విజయ భాస్కర్ రెడ్డి, ఎంపిటీలు, గ్రామ పాలకవర్గ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.