శివాలయ ధ్వజస్తంభ కార్యక్రమానికి హాజరైన మల్లునందిని

Published: Friday February 17, 2023

 బోనకల్, ఫిబ్రవరి 16 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందాపురంలో ఎల్ గ్రామంలో గురువారం శివాలయ ‌ఆలయ ప్రతిష్ట, ధ్వజ స్తంభం కార్యక్రమానికి మధిర శాసనసభ్యులు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎల్ గోవిందా పురం సర్పంచ్ ఉమ్మినేని బాబు, యువజన కాంగ్రెస్ నాయకులు ఉమ్మినేని రమేష్ బాబు, కోటేశ్వరరావు, రాహుల్, సాయి, కోసూరి ప్రవీణ్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.