జెడ్పీ ఛైర్పర్సన్ ను కలిసిన ఉర్దూ పాత్రికేయుల యూనియన్ సభ్యులు
Published: Friday September 02, 2022
జగిత్యాల, సెప్టెంబర్ 01 ( ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జగిత్యాల అధ్యక్షుడు ముజాహిద్ ఆదిల్ ఆధ్వర్యంలో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ని ఉర్దూ పాత్రికేయుల యూనియన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలసినారు. జెడ్పీ చైర్ పర్సన్ నూతనంగా ఎన్నికైన పాత్రికేయుల యూనియన్ సభ్యులకు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు ప్రధాన కార్యదర్శి హఫేస్ ఆబిద్, గౌరవ సలహాదారుడు, ఇర్ఫాన్ జాఫర్ రషీద్, కన్వీనర్ ఫజల్ బైగ్, చీఫ్ అడ్వైజర్ ఖాన్ జియా, జాయింట్ సెక్రెటరీ జామీర్ అలీ అద్నాన్, ఆర్గనైజర్ సెక్రెటరీ జుబేర్ అలీ, వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ అఖిల్ ఈసీ మెంబర్ యూనుస్ సయీద్, షేక్ జమీల్, ఈసీ మెంబర్ ఖలీమ్, ఈసీ మెంబర్ షమ్ము, పాల్గొన్నారు.
Share this on your social network: