ఉపయోగించుకోవాలి : ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బత్తుల హైమవతి
Published: Monday May 17, 2021
ఖమ్మం, మే 15, ఆదివారం (ప్రజాపాలన ప్రతినిధి) : కరోణా పై యుద్ధం అంటూ DYFI,SFI,AIDWA ఖమ్మం జిల్లా కమిటి ల ఆధ్వర్యంలో ఏర్పాటు చెసిన హెల్ప్ లైన్ ను అందరూ ఉపయోగించుకోవాలి అని ఐద్వా రాష్ట్ర నాయకురాలు బత్తుల హైమవతి అన్నారు. స్థానిక మంచికంటి ఫంక్షన్ హల్ లో హెల్ప్ లైన్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా వచ్చి హైమవతి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోణా సమయంలో ప్రభుత్వాలు చేయాల్సినంత ప్రజలకు చెయడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పి ఎమ్. మోడి, సీఎం కెసిఆర్ చాలా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు ప్రజలు దినిని గుర్తించాలని ఆమె అన్నారు. ఏ ఐ డి డబ్ల్యు ఏ. డి వై ఎఫ్ ఐ. ఎస్ ఎఫ్ ఐ. జిల్లా కార్యదర్శులు మాచర్ల భారతి, షేక్ బషీరుద్దీన్, అశోక్ మాట్లాడుతూ హెల్ప్ లైన్ ను అందరూ ఉపయోగించుకోవాలి అని ఎవరు భయపడవద్దని, కరోణా పై యుద్ధం చెద్దాం అంటూ పిలుపునిచ్చారు,మెడిసిన్, భోజనం, ఉండేవిదానం పట్ల అవగాహన కల్పించడం తో పాటు గా భోజనం ఇతర సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ డి డబ్ల్యు ఏ.డి వై ఎఫ్ ఐ.జిల్లా అధ్యక్షులు బండి పద్మ, మద్దాల ప్రభాకర్ దినిని గుర్తించాలని ఆమె అన్నారు. ఏ ఐ డి డబ్ల్యు ఏ.డి వై ఎఫ్ ఐ.ఉపాధ్యక్షులు గుమ్మా ముత్తారావు, పోలేపల్లి చరణ్య, ఇంటూరి అశోక్, మెరుగు రమణ DYFI జిల్లా నాయకులు రావులపాటి నాగరాజు, కూరపాటి శ్రీను, సౌజన్య, భాస్కర్ రావు మంగయ్య తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: