ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 24 ప్రజాపాలన ప్రతినిధి *బాలికల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన*

Published: Wednesday January 25, 2023

* ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
* 35 లక్షల రూపాయలతో స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన మరి నిరంజన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం( ఆల్ ఇన్ వన్)  స్టడీ మెటీరియల్స్ ను విద్య విలువ తెలిసిన వాడిగా ప్రతి సంవత్సరం లక్షలు వెచ్చించి మర్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో  ఉచిత స్టడీ మెటీరియల్స్ ను అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్, భువనగిరి పార్లమెంటు సభ్యుడు  కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై ఆయన చేతుల మీదుగా  బొంగులూరు మోడల్ స్కూల్లో  విద్యార్థులకు మంగళవారం స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ  అన్ని దానాల్లోకెల్లా విద్యా దానం గొప్పదని తలచి మర్రి నిరంజన్ రెడ్డి విద్యార్థులకు మెటీరియల్స్ ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నారని ఆయన సేవలను కొనియాడారు. బుధవారం నుండి నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్స్ అందజేస్తారని ఆయన తెలిపారు. పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పదవ తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి తగిన పారితోషకాలు ఉంటాయని తెలిపారు. అనంతరం విద్యార్థులకు నగదు పారితోషకం అందించారు ఈ కార్యక్రమంలో ఆదిభట్ల చైర్ పర్సన్ ఆర్థిక గౌడ్, జెడ్పిటిసి భూపతిగల్ల మహిపాల్,మర్రి నిత్య నిరంజన్ రెడ్డి, కొత్త కుర్మ శివకుమార్,ఎంఎన్ఆర్ యువసేన అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి, అర్చన, మౌనిక, బాలరాజు గౌడ్, శంకర్ గౌడ్, రజనీకాంత్,  లావణ్య పాండురంగారెడ్డి శంకర్ స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు, మోడల్ స్కూల్ స్కూల్ ప్రిన్సిపల్ లావణ్య, వైస్ ప్రిన్సిపల్ వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.