ఓటీపీ నెంబర్ చెప్పవద్దు.. యువకులకు అవగాహన కల్పించిన ఎస్సై సురేష్
Published: Tuesday July 05, 2022
తల్లాడ, జులై 4 (ప్రజా పాలన న్యూస్):
సమాజంలో యువత గంజాయి, మద్యానికి బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, వాటిపట్ల దూరంగా ఉండాలని తల్లాడ ఎస్సై సురేష్ సూచించారు. సోమవారం తల్లాడలో ఆయన యువకులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలను అతివేగంగా నడపవద్దని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గంజాయి, గుట్కా, పాన్ పరాకులపై ఉక్కు పాదం మోపుతామన్నారు. అదేవిధంగా ప్రస్తుతం సెల్ ఫోన్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, ఎవరు తమ ఓటీపీ నెంబరు ఇతరులకు చెప్పవద్దని సూచించారు. ఆన్లైన్ మోసాలు అధికంగా జరుగుతున్నందున యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు, కానిస్టేబుల్ బాలాజీ, రంజిత్, తదితరులు ఉన్నారు.
Share this on your social network: