ఛందోళి లో కోవిడ్ 19 వ్యాక్షిన్ అవగాహన
Published: Tuesday March 09, 2021
గొల్లపల్లి, మార్చి 08 (ప్రజాపాలన ప్రతినిధి) : గొల్లపల్లి మండలం ఛందోళి గ్రామంలోగ్రామ సర్పంచ్ అలిశెట్టి రవీందర్ సమక్షంలో ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ కరీంనగర్ వారి సౌజన్యంతో కోవిడ్-19 నివారణ వ్యాక్షిన్ టీకా అవగాహన కార్యక్రమాం నిర్వహించారు. కరోన వ్యాక్షిన్ టీకా ప్రతిమ ఆసుపత్రిలో రూ.250 ధరలో అందుబాటులోఉందని తెలిపారు. టీకా 45సం నుండి 60 సం లోపు వారికి వేస్తామని సంస్థ కోఆర్డినేటర్ చంద్ తెలిపారు టీకా తీసుకునే వారికి ప్రతిమవైద్య విజ్ఞాన సంస్థ ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని అందరూ ఈ అవకాశం వియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేష్ ఎంపీటీసీ అశోక్ వార్డు సభ్యులు నాగరాజు శ్రీనివాస్ రాజు సిద్దూ, కార్యదర్శి మణికంఠ కారొబార్ లక్ష్మణ్ జీపీ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: