నానక్‌రామ్ గూడలో ఎలాంటి సమస్యలున్నా నన్ను సంప్రదించండి : కార్పొరోటర్ గంగాధర్ రెడ్డి

Published: Thursday May 06, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నానక్ రామ్ గూడలో ప్రజా సమస్యలపై జరిగిన బస్తీ బాటలో భాగంగా గచ్చిబౌలి కార్పొరోటర్ గంగాధర్ రెడ్డి గల్లీ గల్లీ తిరిగి నానక్ రామ్ గూడలో సమస్యల గురించి ప్రజలను ఆరా తీశారు. ఇందులో భాగంగా బస్తీలో డ్రైనేజి, సీసీ రోడ్డులు, వీధి దీపాల పనితీరుపై తనిఖీ చేశారు. జి.హెచ్.ఎం.సి అధికారులతో మాట్లాడుతూ వార్డులో తాగునీరు, సిసి రోడ్లు, మురికి కాలువల పనుల గురించి చర్చించారు. బస్తీలో వెంటనే కొత్త సీసీ రోడ్లు మంజూరు చేయాలనీ అధికారులని కోరారు. అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని త్వరగా పరిష్కరించాలని కోరారు. ఎలాంటి సమస్య ఉన్న ఇబ్బంది పడకుండా తనని సంప్రదించాలని కార్పొరేటర్ స్థానికులకు హామీ ఇచ్చారు. అలాగే కరోన వ్యాధి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ బస్తీబాట కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మునిసిపల్ అధికారులు, బస్తి వాసులు పాల్గొన్నారు.