*కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉంటా!*

Published: Monday October 10, 2022
మాజీ ఎంపీ పొంగులేటి*

మధిర రూరల్ అక్టోబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి) కష్టాల్లో ఉన్న జిల్లా ప్రజలకు అండగా ఉంటానని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని వంగవీడు అంబారు పేట, మధిర పట్టణంలో విస్తృతంగా పర్యటించి ఇటీవల మృతి చెందిన  కుటుంబాలను పరామర్శించడం తోపాటు పలు శుభకార్యాల్లో ఆయన పాల్గొన్నారు. వంగవీడులో ఇటీవల మృతి చెందిన శీలం సిద్దారెడ్డి సోదరి ఐలూరి సావిత్రమ్మ మృతి చెందడంతో గ్రామంలోని ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా బుడిద కన్నయ్య నారాయణలు మృతి చెందడంతో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబారు పేటలో చిలకా దుర్గ మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. మధిర పట్టణంలో కోన సుబ్బారావు మృతి చెందడంతో సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారుడు జగదీష్ ని పరామర్శించి ఓదార్చారు. అదేవిధంగా బొగ్గుల సాంబశివారెడ్డి కుమార్తె, కుమారుడు ఓణీలు పంచకట్టు వేడుకలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పొంగులేటి పేర్కొన్నారు. జిల్లా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తానని ఆయన తెలిపారు. జిల్లా ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటాన న్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్లు ఐలూరి వెంకటేశ్వర రెడ్డి తుళ్లూరి బ్రహ్మయ్య డాక్టర్ కోటా రాంబాబు బొమ్మెర రామ్మూర్తి రైతుబంధు మండల సమితి మాజీ కన్వీనర్ యన్నం కోటేశ్వరరావు, దేవిశెట్టి రంగారావు వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, సిద్దినేని గూడెం సొసైటీ అధ్యక్షులు కటికల సీతారామిరెడ్డి, నాగవరప్పాడు మాజీ సర్పంచ్, ప్రముఖ న్యాయవాది చావాలి రామ రాజు యాదవ్, సర్పంచులు బొగ్గుల పద్మావతి చెరుకూరి నాగార్జున ఎర్రగుంట రమేష్ కౌన్సిలర్ ఇక్బాల్ నిదానపురం సర్పంచ్ బాదా కృష్ణారెడ్డి ఎంపిటిసి వెంపటి మరియమ్మ అమరవాది కోటిరెడ్డి అక్కినపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.