భౌతిక దూరం ఎక్కడ?
Published: Wednesday June 23, 2021
బ్యాంక్ లో జనాల రద్దీ ! భౌతిక దూరం అంటే ఏమిటో తెలియనట్టుగా వ్యవహారం
పరిగి, జూన్ 22, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రజల అలసత్వం కారణంగా బూడిదలో పోసిన పన్నీరు లాగా వృధా అవుతున్నాయి. మంగళవారం పరిగి నియోజక వర్గం దోమ మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకు లో వినియోగదారులు భారీగా భారులు తీరారు. లాక్ డౌన్ ముగియడంతో జనం బ్యాంకు కు చేరుకొని లావాదేవీల కోసం భారులు తీరారు. అయితే ప్రభుత్వ నియమాలను తుంగలో తొక్కి భౌతిక దూరాన్ని పాటించకుండా కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Share this on your social network: