కోరుట్ల ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై భగ్గుమన్న యూత్ కాంగ్రెస్ శ్రేణులు

Published: Thursday January 19, 2023

కోరుట్ల, జనవరి 18 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణంలో 17 జనవరి  తేదీన బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో కొందరు బిఆర్ఎస్ నేతలు మరియు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు లు మాజీ మంత్రి  జువ్వాడి రత్నాకర్ రావు మీద మరియు ప్రతిపక్ష నాయకులు అయినా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణా రావుతో పాటుగా  కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ కుటుంబం  ప్రజా సంక్షేమం కోసం ఆమోదయోగ్యమైన రీతిలో అభివృద్ధి కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తూ ప్రశ్నిస్తే, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి జవాబుదారీతనంతో వ్యవహరించాల్సి పోయి మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు మీద మరియు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు మరియు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణా రావుల మీద ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తు, బిఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తూ,కోరుట్ల పట్టణంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దిష్టిబొమ్మ దగ్దం చేసి నిరసన చేపట్టరు.బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజా సంక్షేమం గాలికొదిలి తమ స్వార్థ ప్రయోజనాల కోసమే అధికారాన్ని ఉపయోగిస్తున్నారని యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రిజ్వాన్ పాషా,పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి మ్యాకల నర్సయ్య,పట్టణ కాంగ్రెస్ సహాయ కార్యదర్శి ఎంబెరి సత్యనారాయణ,
మైనారిటీ నాయకులు ముహమ్మద్ సలీం,బారి, కోరుట్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ వాసం అజయ్,యూత్ కాంగ్రెస్ నాయకులు ముజమ్మిల్, అష్రఫ్, వాజిద్ ,తహసీన్ లు పాల్గొన్నారు.