సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి

Published: Friday May 28, 2021
మధిర రూరల్.27 ప్రజాపాలన ప్రతినిధి : సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులూ పంపిణి చేశారు. మధిర మండలంలోని మర్లపాడు, వంగవీడు, అంబారు పేట, గ్రామాలకు చెందిన పలువురు అనారోగ్యంతో బాధపడుతూ వివద హాస్పిటల్స్ నందు చికిత్స పొందారు వైద్యం కు అయిన ఖర్చులు ఇప్పించాలని ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యే బట్టి విక్రమార్క ద్వారా బాధితులు దరఖాస్తులు చేస్తుకున్నారు వాటికీ సంబంధించిన చెక్కులు రావటంతో  మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పంపిణి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, నాయకులూ దార బాలరాజు, షేక్ జహింగీర్, మహమ్మద్ ఆలీ, మైలారపు చక్రి, తదితరులు పాల్గొన్నారు.