మండలంలో పర్యటించిన జడ్పీ చైర్మన్ లింగాల

Published: Monday November 28, 2022
బోనకల్ , నవంబర్ 28 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలో ఆదివారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పర్యటించి తుటికుంట్ల గ్రామం లో జరుగుతున్న కొల్లి రాంబాబు కుమారుని అన్నప్రాసన వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.అనంతరం ఎస్సై దుందులూరి రాధ బాబు గ కుమారుని అన్నప్రసన వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, మండల రైతు కన్వీనర్ వేమూరి ప్రసాద్, నాయకులు వెనిగళ్ళ మురళి, టిఆర్ఎస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.