మండలంలో పర్యటించిన జడ్పీ చైర్మన్ లింగాల
Published: Monday November 28, 2022
బోనకల్ , నవంబర్ 28 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలో ఆదివారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పర్యటించి తుటికుంట్ల గ్రామం లో జరుగుతున్న కొల్లి రాంబాబు కుమారుని అన్నప్రాసన వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.అనంతరం ఎస్సై దుందులూరి రాధ బాబు గ కుమారుని అన్నప్రసన వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, మండల రైతు కన్వీనర్ వేమూరి ప్రసాద్, నాయకులు వెనిగళ్ళ మురళి, టిఆర్ఎస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.
Share this on your social network: