దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవాలి. కొండపల్లి శ్రీధర్రెడ్డి.

Published: Thursday July 07, 2022
పాలేరు జూలై 6 ప్రజాపాలన ప్రతినిధి
దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవాలని బీజెపీ
కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి సూచించారు.
జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి ని బుధవారం నిర్వహించారు. కొండపల్లి నేలకొండపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక వద్ధ మొక్కలు నాటారు. తొలుత ఆయన చిత్ర పటం కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ సమగ్రత కోసం పాటుపడ్డ మహోన్నత వ్యక్తులను ఎప్పటికి గుర్తుంచుకోవాలని సూచించారు.
దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ముఖర్జీ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్,
బీజెవైయం జిల్లా అధ్యక్షుడు అనంతు ఉపేందర్ గౌడ్, మండల అధ్యక్షుడు
మన్నె కృష్ణారావు. ఎల్లారావు గౌడ్, మన్నె రాధాకృష్ణ, రామోహన్రెడ్డి, 'సుధీర్ తదితరులు పాల్గొన్నారు.