ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి ఏ.ఐ.ఎఫ్.డి.ఎస్,.బీసీవిస్,టిజివిపి,పిడీఎస్యూ విద్యార్థ

Published: Monday September 19, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 18 ప్రజా పాలన ప్రతినిధి: విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను  వెంటనే సస్పెండ్ చేయాలని, ఏ ఐఎఫ్ డి ఎస్, బీ సివి  ఎస్,టి జివిపి, పిడిఎస్యు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఆదివారం   తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలురపాఠశాల,కళాశాల(TSWRJC) ముందు ఐక్యవిద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించారు,అనంతరం వారు మాట్లాడుతూ  వజ్రోత్సవాలలో భాగంగా శనవారం   ప్రిన్సిపాల్,పిఈటి, టిచర్లు విద్యార్థులతో బెంచీలు మోపించడంతో పాటు వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్ల
 ఆరవ తరగతి విద్యార్థి కిందపడి చేయి విరిగిందని, వైద్య చికిత్స ల కోసం   మంచిర్యాలకు   తీసుకెళ్లాలని వైద్యులు చెప్పిన    తీసుకెళ్ళకుండా వారి  తల్లిదండ్రులకు వచ్చేవరకు ఆపి అప్పగించారని,విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ,అమర్యాదగా ప్రవర్తిస్తూ,మెరుగైన వైద్యం అందించకుండా,అధికారులకు తెలుపకుండా తన ఇష్టారీతిన ప్రవర్తిస్తున్న ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు,
లేనిచో  పెద్ద ఎత్తున దశలవారి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సబ్బని రాజేంద్రప్రసాద్, అల్లి సాగర్,మురళి,రెడ్డి చరణ్, తదితరులు పాల్గొన్నారు.