ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలి
Published: Tuesday July 05, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో జూలై 04 ప్రజా పాలన : గత వారంలో నిర్వహించిన ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిఖిల తహసీల్దార్లను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో భూ సమస్యలపై ప్రజల నుండి 183 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సర్వే సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, సర్వయర్ ల కొరత కారణంగా ఉన్న సర్వేయర్లను ప్రతి రెండు మండలాలకు ఒక సర్వేయర్ను సర్దుబాటు చేసి సమస్యలను పరిష్కరించాలన్నారు. కొన్ని మండలాలలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, మండల స్థాయిలో సర్వేయర్లతో సమీక్షలు నిర్వహించి వాటిని వారం రోజులలో పరిష్కరించాలని ఆదేశించారు. భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఇంకా లాగిన్ లో 920 అపరిష్కృతంగా ఉన్నాయని, వీటిని తహసీల్దార్లు తమ స్థాయిలో చర్యలు చేపట్టి వివరాలు అందించినట్లయితే పరిష్కారించుటకు వీలు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి విజయకుమారి,
ల్యాండ్ అండ్ సర్వే సహాయ సంచాలకులు రాంరెడ్డి, ఏ ఓ అమరేందర్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
Share this on your social network: