వృద్ధ దంపతులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి ....రాష్ట్ర ముదిరాజ్ మహాసభ కార్యదర్శి ముల్

Published: Thursday September 22, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి: వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని పులిమామిడి  గ్రామంలో ముదిరాజు వృద్ధ దంపతులపై దాడి చేసిన ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి అతని కుటుంబ సభ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ కార్యదర్శి ములకలపల్లి వెంకటేశ్వర్లు, అతని అనుచరులు బుధవారం డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు, జీవనోపాధి అయినా భూమిని బలవంతంగా తమకు అమ్మాలని  ఒత్తిడి చేస్తూ దాడులు సైతం చేస్తూ భూములు కాజేయాలని చూస్తున్న రామకృష్ణారెడ్డి అతని అనుచరులు, కుటుంబ సభ్యులపై హత్యాయత్నం  కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి, టిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
చావు బ్రతుకుల్లో ఉన్న ముదిరాజు దంపతులకు  ఏదైనా జరగరానిది జరిగితే, రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. సంఘటన జరిగిన వెంటనే స్పందించిన రాష్ట్ర ముదిరాజు నాయకులకు, ముదిరాజ్ జర్నలిస్టుల నాయకులకు, వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇకముందు ఎక్కడ ఏ సంఘటన ముదిరాజులపై జరిగిన ముదిరాజులందరూ మూకుమ్మడిగా సమస్యను ఎదుర్కోవాలని అప్పుడే మన విలువ మిగతా వారికి తెలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ములకలపల్లి వెంకటేశ్వర్లు, మంచిర్యాల జిల్లా ముదిరాజ్ మహాసభ సభ్యులు  దండేని ఐలయ్య, నూనే రవీందర్, పోలవేన కనకయ్య, పేట మల్లయ్య, తాళ్ళ కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.