ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 25ప్రజాపాలన ప్రతినిధి *సధర్ పండుగ యాదవుల వారసత్వ వేడుక* *అఖిల భారత

Published: Wednesday October 26, 2022
యాదవుల ఐక్యతకు ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే గొప్ప వేదిక సదర్‌ సమ్మేళనమని అఖిల భారత యాదవ మహా సభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బర్ల జగదీశ్వర్ యాదవ్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం  యాదవ సంఘం నాయకులు ఎలిగపల్లి శ్రీరాం యాదవ్‌ ఆధ్వర్యంలో శేరిగూడ లో సోమవారం రాత్రి  సదర్‌ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ యాదవ్ మాట్లాడుతూ సధర్ పండుగ  యాదవుల ఆత్మగౌరవ ప్రతీక అని యాదవులు సదర్‌ను గర్వాంగా జరుపుకోవాలని అన్నారు. దైనందిన జీవితంలో తమతో పాటు తమ జీవితంలో బాగా సౌమ్య మైన పశు సంపదను గౌరవించి చేసుకుని యాదవుల గొప్ప పండుగ సధర్ గా అభివర్ణించారు. వేలాది సంవత్సరాలుగా వారసత్వంగా వస్తున్న మన పండుగలను  గర్వాంగా జరుపుకోవాలని ఏమాత్రం నాముషీగా బావించారాదని అన్నారు. మనకు మాత్రమే చెందిన ప్రధాన పండుగని భావితరాలకు పరిచయం చెయ్యాల్సిన బాధ్యత నేటి యువత పైన ఉందని జగదీశ్వర్ అన్నారు.వైభవోపేతం మైన వారసత్వ సధర్ సమ్మేళనం లో బాగా సామ్యం కల్పించి గత వైభవాన్ని మరోసారి సృజించుకునే అవకాశం కలిగింది అన్నారు.ఈ సందర్భంగా దున్నపోతులను సుందరంగా అలంకరించి బ్యాండ్‌ మేళాలతో యాదవులు నృత్యాలు చేస్తూ ఘనంగా సంబురాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు దున్నపోతులతో వచ్చిన వారికి మెమొంటోలను బహుకరించారు.
ఈ కార్యక్రమంలో ఎలిగపల్లి కుటుంబ సభ్యులు  యాదయ్య యాదవ్, ఐలయ్య యాదవ్, మల్లేష్ యాదవ్,  మల్లేష్ యాదవ్,చంద్రమౌళి శ్రీశైలం యాదవ్,  భాషయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్, యాదయ్య యాదవ్ ,పొలమోని మహేష్, యాదవ్,నవీన్,హనుమంత్,బద్ధుల కుమార్,ప్రదీప్ కుమార్, తరుణ్ తేజ్,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.