ఎంపీ ధర్మపురి అరవింద్ నోరు అదుపులో పెట్టుకోవాలి.

Published: Wednesday November 23, 2022

-అశ్వాపురం మాజీ జెడ్పిటిసి, బిఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు తోకల లత .
అశ్వాపురం ( ప్రజా పాలన.)
రాబోయే రోజులలో అన్ని నిజాలు బయటకు వస్తాయని ప్రజా క్షేత్రంలో తప్పని సరిగా ప్రజా తీర్పును శిరసావహించాల్సిందేనని  ఆమె అన్నారు.
గత 3 సంవత్సరాలుగా ఎంపిగా ధర్మపురి అరవింద్ సాధించింది ఏమిటో ప్రజలకు వివరించాలని బాధ్యత గల పార్లమెంట్ సభ్యునిగా ఉండి ఓ మహిళా మాజీ ఎంపి, ప్రస్తుత ఎమ్మెల్సీ పై నోటికి వచ్చినట్లు మాట్లాడటం సబబు కాదని అశ్వాపురం మాజీ జెడ్పిటిసి, బిఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు తోకల లత
అన్నారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె రాజకీయాలలో ఆరోపనలు ఉంటాయని అందుకు విరుద్దంగా ఎంపి అరవింద్ ముఖ్యమంత్రి కేసిఆర్ తో పాటు కవితను నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు.నిజామాబాద్ ఎంపిగా పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానన్న విషయాన్ని వదిలి చిల్లర రాజకీయాలు చేయటం తగదని ఆమె అన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే బిజెపిది ఇదేనా క్రమశిక్షణ అని ఆమె ప్రశ్నించారు. అవునన్నా కాదన్నా కేసిఆర్ ఉద్యమం  కారణంగానే తెలంగాణా సిద్దించిందని ఆమె అన్నారు. ఇప్పటికైనా ఎంపి అరవింద్ నోరు మధుప్రియ పెట్టుకోవాలని లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు ఓటు బ్యాంకు ద్వారా తగిన బుద్ధి చెప్తారని ఆమె హితవు పలికారు.