సీనియర్ పాత్రికేయుడు 'తేనె' ను పరామర్శించిన తమ్మినేని

Published: Monday August 29, 2022
 
బోనకల్, ఆగస్టు 28 ప్రజా పాలన ప్రతినిధి: సీనియర్ పాత్రికేయుడు మండల నవ తెలంగాణ విలేకరి తేనె వెంకటేశ్వర్లు ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం పరామర్శించారు. మండల పరిధిలోనే చిరునోముల గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు తేనే వెంకటేశ్వర్లు కి ఇటీవల గుండెకు సంబంధించిన వైద్య చికిత్స నిర్వహించారు. ఈ విషయం తెలిసిన తమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు తో కలిసి తన స్వగ్రామం చిరు నోముల వెళ్లి తేనె వెంకటేశ్వర్లని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరగా కోలుకొని తిరిగి తన విధులను యధావిధిగా నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ తెల్ల బోయిన రామారావు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట సిపిఎం చింతకాని మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, సిపిఎం చిరునోమల శాఖ కార్యదర్శి నిమ్మల రామారావు, మాజీ ఎంపీటీసీ నిమ్మ తోట ఖానా, మాజీ ఉపసర్పంచ్ నీలకంఠం రాము, సిపిఎం చిరునోముల మాజీ శాఖ కార్యదర్శి పంతంగి శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు వేమ రామయ్య, ముంగి వెంకన్న, నిమ్మ తోట లక్ష్మయ్య, గోళ్ల కోటేశ్వరరావు, మర్రి రామారావు, పరిస పుల్లయ్య, అల్లిక రంగయ్య, రేగళ్ల శ్రీనివాసరావు, రేగళ్ల చిన్ని, సావిటి వెంకన్న, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గరపాకుల రామకృష్ణ తదితరులు ఉన్నారు.