చిన్నారులను ఆశీర్వదించిన ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు..

Published: Friday February 10, 2023
తల్లాడ, ఫిబ్రవరి 9 (ప్రజా పాలన న్యూస్): 
 
 తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు ఇస్నపల్లి శ్రీనివాసరావు, మార్తమ్మ దంపతుల కుమార్తెల ఓణీల ఆలంకరణ వేడుక గురువారం మహాలక్ష్మి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తల్లాడ ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, తహాసిల్దార్ గంటా శ్రీలత, ఎంపీడీవో రవీంద్రారెడ్డి, ఎంఈఓ దామోదర్ ప్రసాద్, పిఆర్ ఏఈ అశోక్ హాజరై చిన్నారులు శ్రావ్యశ్రీ, సాత్వికలకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి చదువుల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎంపీవో కొండపల్లి శ్రీదేవి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకటలాల్, బాలపేట సర్పంచ్ కూసురి వెంకట నరసింహారావు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వరరావు(జి.వి.ఆర్), సొసైటీ డైరెక్టర్ గోవిందు శ్రీనివాసరావు, అన్నారుగూడెం హెచ్ఎం మాదినేని నర్సింహరావు, తదితరులు ఉన్నారు.*