పాఠశాల విద్యార్థులకు టై, బెల్టులు ప్రధానం

Published: Wednesday October 06, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 150 మంది విద్యార్థిని, విద్యార్థులకు గ్రామపంచాయతీ 9వ వార్డు మెంబర్ మడుపు అనిత వెంకటేష్ బెల్టులు, టైలు సోమవారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మడుపు అనిత వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకుని విద్యలో రాణించి జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులున్న తన దృష్టికి తేవాలని కోరారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు బోసుపల్లి విరేష్ కుమార్, ఓరుగంటి నరసింహ, మడుపు శ్రీశైలం, ఓరుగంటి రాములు, బుట్టి మహేందర్ ముదిరాజ్, ఎలుగపల్లి శ్రీరామ్ యాదవ్, ఓరుగంటి శ్రీనివాస్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మార మొని శ్రీనివాస్,  విద్యా కమిటీ చైర్మన్ బత్తుల వెంకటేష్, మడుపు ధనంజయ నరాల జంగయ్య, ఎలుగపల్లి మల్లేష్, కొంగరి ప్రశాంత్ కుమార్, నల్లోల శేఖర్, నరకుడి ఆనంద్, మహిళలు మడుపు కృష్ణవేణి, నర్కుడి సరిత, శ్రీలత, పద్మ, అరుణ, రాణి, మరియు స్కూలు ప్రధానోపాధ్యాయులు టీచర్స్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.