బిజెపి ఎదుగుదలను ఓర్యవలేకే టిఆర్ఎస్ కుట్రలు ** జిల్లా అధ్యక్ష కార్యదర్శి శ్రీనివాస్, కోట్నా

Published: Wednesday November 30, 2022

ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 28 (ప్రజాపాలన, ప్రతినిధి) : బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రను ఆపేందుకు కుట్రలు చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ వైఖరిని నిరసిస్తూ సోమవారం బిజెపి నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్నాక విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంత రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేపట్టారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ శాంతియుతంగా తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కు వెళ్తున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. యాత్రను యధావిధిగా కొనసాగించవచ్చని అనుమతి రావడంతో కెసిఆర్ ప్రభుత్వానికి చెప్పుతో కొట్టినట్లు అయిందన్నారు. పోలీసులు టిఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయడం సిగ్గుచేటు అన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో బిజెపి నాయకులు స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఆత్మారాం నాయక్, కిరణ్ కుమార్. సురేష్, కోవ విజయ్, దౌలత్ రావు, భీమ్ రావు, మాణిక్ రావు, తదితరులు పాల్గొన్నారు.