టిఆర్ఎస్ ఎస్టీసెల్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం.

Published: Thursday March 24, 2022
మధిర మార్చి 23 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు టిఆర్ఎస్ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టిఆర్ఎస్ నాయకులు. కేంద్ర ప్రభుత్వం ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు నుండి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఎస్టీసెల్ విభాగం ఆధ్వర్యంలో మరియు టిఆర్ఎస్ పట్టణ, మండల కమిటీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను అంబేద్కర్ సెంటర్లో ఈరోజు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎస్టీల రిజర్వేషన్ విషయంలో తాత్సారం చేస్తూ ఎస్సీ ఎస్టీల ను మోసం చేస్తుందని 6% రిజర్వేషన్ నుండి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు కనుమూరు వెంకటేశ్వరరావు మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు  నాగేశ్వరరావు, ఎస్టీసెల్ మండల అధ్యక్షులు గూగుల్ కృష్ణ, మాజీ జెడ్పిటిసి మూడ్ ప్రియాంక, 9వ వార్డు కౌన్సిలర్ ధీరావత్ మాధవి, పళ్ళ పోతుల ప్రసాదరావు మేందెం వెంకన్న టిఆర్ఎస్ మధిర నియోజకవర్గ అధ్యక్షులు కోన నరేందర్ రెడ్డి, జేవీ రెడ్డి ఆళ్ల నాగబాబు గద్దల రాజా గద్దల నాని భూక్య చంద్రం వెంకటాపురం సర్పంచ్ ధీరావత్ లక్ష్మి సఫా వత్ హనుమానాయక్ కొంగర రవి గాలిబ్ పాషా, కురెస్ జేవీ రెడ్డి. వేల్పుల శివ, మేడిశెట్టి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.