ధనలక్ష్మి హంతకులను కఠినంగా శిక్షించాలి : బెల్లంపల్లి ఆర్యవైశ్య సంఘం డిమాండ్

Published: Friday September 24, 2021
బెల్లంపల్లి సెప్టెంబర్ 23, ప్రజా పాలన ప్రతినిధి : నల్గొండ జిల్లా మోషం పెళ్లి గ్రామంలో వైశ్య మహిళ ధనలక్ష్మి నీ వివస్త్రను చేసి  కిరాతకంగా హత్య చేసిన హంతకులను అరెస్టు చేసి  శిక్షించాలని బెల్లంపల్లి ఆర్యవైశ్య యువజన సంఘం డిమాండ్ చేసింది. గురువారం నాడు స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు చిలువేరు దయాకర్, రేణికుంట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ చిరు వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్న ధనలక్ష్మి ప్రక్క గ్రామానికి వెళ్లి వస్తుండగా ఒంటరిగా వస్తున్న మహిళను గమనించిన లింగయ్య యాదవ్ మరియు పుల్లయ్య అనే వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం పిలుపు మేరకు ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిలువేరు దయాకర్, కార్యదర్శి రేణికుంట్ల ప్రవీణ్, పాత భాస్కర్, నల్మాస్ సంతోష్, సముద్రాల రామన్న, బాల సంతోష్, వోల్లాల సంతోష్, తదితరులు పాల్గొన్నారు