మానవత్వం పరిమళించే మంచి మనసుకు వందనం

Published: Tuesday May 25, 2021
పాలేరు మే 24 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు బ్యాంకుకి వృథాప్య పీన్షన్ తీసుకొని తిరిగి తన సొంత ఊరు ఐనా దమ్మాయిగూడెం వెళ్లుటకు లాక్ డౌన్ వలన ఆటోలు లేక నడిచి వెళ్లుచున్న వృద్ధురాలని పెట్రోలింగ్ చేస్తున్నా తీరుమాలయపాలెం. సబ్ ఇన్స్పెక్టర్ రఘు, చూసి చలించి మానవత దృక్పడంతో ఆ వృద్ధ మహిళను తన పెట్రోలింగ్ కార్లో ఎక్కించుకుని క్షేమంగా ఆమె ఇంటి వద్దకి చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఎస్ ఐ రఘు కు అభినందనలు చేశారు