గిరిజనుల సాంస్కృతిక సాంప్రదాయ పండగ కు హాజరైన టిపిసిసి కొత్త కుర్ర్మ శివకుమార్

Published: Friday August 27, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 26 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మంచాల మండలం లోని పల్లి గ్రామంలో గిరిజనుల సాంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా తీజ్ పండగ తండాల్లో ఘనంగా నిర్వహించారు. ఆటపాటలు, సంప్రదాయ నృత్యాలు గిరిజన తాండాలు సందడిగా మారాయి. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో యపల్లి గ్రామంలో తీజ్ ఉత్సావాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథి గా టిపిసిసి కార్యదర్శి కొత్త కుర్మా శివకుమార్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలు బాగా కురిసి పంటలు సస్యశ్యామలంగా సంవృద్ది గా పండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కౌన్సెలర్ల ఫోరమ్ అధ్యక్షురాలు కొత్త కుర్మా మంగమ్మ, మాజీ మండల ఎంపీపీ శ్రీనివాస్ నాయక్, జిల్లా యూ టి ఎఫ్ కార్యదర్శి కొర్ర కిషన్ నాయక్ బాలు నాయక్ తండావాసులు తదితరులు పాల్గొన్నారు.