నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల పంపిణీ ఎ.ఏం.సి. చైర్మన్ పత్తిపాక వెంకటేష్

Published: Monday July 18, 2022

వెల్గటూర్, జూలై 17 (ప్రజాపాలన ప్రతినిధి) జీవనాధారం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు అండగా నిలవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆలోచనల్లో  భాగంగా మండలంలోని కోటిలింగాల గ్రామానికి చెందిన అడ్డగట్ల మెకానిక్ రవి ఎడమ కాలు తొంటి విరిగి పూర్తిగా లేవలేని స్థితి లో ఉండగా ఆదివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్ ఆధ్వర్యంలో  రవి కుటుంబానికి  నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పత్తిపాక వెంకటేష్ మాట్లాడుతూ రవి కుటుంబం  గడవక చాలా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఆవేదన వ్యక్తం చేశారు.  మన చుట్టూ ఉన్న పేద కుటుంబాలకు ప్రతిఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో తె.రా.స మండల శాఖ ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్,సీనియర్ నాయకులు పెద్దూరి భరత్ కుమార్,గ్రామ శాఖ అధ్యక్షుడు కోటయ్య,రవి తేజ, ఫోరండ్ల రాజు,దాసరి విజయ్,ఫోరండ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.