కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ
Published: Friday May 28, 2021
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపాలన ప్రతినిధి : రెండో విడత వలన కరోనాతో బాధపడుతున్న ప్రజలకు అండగా ఉండాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న కరోనా బాధితులకు యువ సేన కార్యకర్తలు అండగా ఉండాలని పిలుపునివ్వడంతో సంపతన్న యువసేన రాష్ట్ర అధ్యక్షులు దండు నరేష్ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని 23వ వార్డులో కరోనాతో బాధపడుతున్న కొన్ని కుటుంబాలకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా దండు నరేష్ మాట్లాడుతూ ఈ సెకండ్ వై కరోనా వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే కుటుంబ పెద్దలు కరుణతో చనిపోవడం వలన కుటుంబంలోని చిన్నపిల్లలు అనాధలుగా మిగిలిపోతున్నారు వెంటనే ఈ రాష్ట్ర, కేంద్ర, ప్రభుత్వాలు వారిని ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భూషపాక సుధాకర్, కలకాల మల్లేష్, పెంబర్తి రాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: