**ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు**

Published: Thursday March 30, 2023

తెలంగాణ తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో  మున్సిపల్ అధ్యక్షులు జక్కా రాంరెడ్డి  ఆధ్వర్యంలో చెరువు కట్టపై ఎన్టీఆర్ విగ్రహానీకి పూలమాలలు  వేసి,జెండా  ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇన్చార్జి చింతకింది చక్రపాణి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు స్థాపించిన  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 41 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జెండా రాష్ట్రవ్యాప్తంగా ఎగురుతుందని ఆయన తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా నిలిచిన నందమూరి తారకరామారావు అడుగుజాడల్లో నడిచిన చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా   ప్రజలకు సేవలు అందించి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర మహిళా ఆర్గనైజ్ సెక్రెటరీ మంకు ఇంద్ర,భువనగిరి పార్లమెంటు యూత్ అధ్యక్షులు జక్క కరుణాకర్ రెడ్డి,పిఎసిఎస్ డైరెక్టర్ బొమ్మ కంటి అశోక్,మాజీ ఎంపీటీసీ బోల సీతయ్య,కాసోజు వీరాచారి,గరిగ వెంకటేష్, కప్పరి అంజయ్య, పండల రాందాస్ గౌడ్,భూసాని ప్రభాకర్,శేఖర్ రావు,మంగళవారం రాములు,జంపాల బిక్షపతి,కంబాలపల్లి బిక్షపతి,పి.నరసింహ, శివకుమార్ రెడ్డి,రాజేష్ యాదవ్. తదితరులు పాల్గొన్నారు.తదుపరి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం నుండి చింతకింది చక్రపాణి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో బయలుదేరడం జరిగింది.

  **ఆరుట్ల గ్రామంలో తెలుగుదేశం   జెండా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపారు**

మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపారు ఈ సందర్భంగా  తెలుగుదేశం జెండా ఇంటింటికి మళ్ళీ సభ్యత్వం పెంచి తెలుగుదేశం జెండా ఎగిరే విధంగా
ఉంటుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరుట్ల గ్రామ అధ్యక్షుడు నరేష్. మాజీ మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండి సలాం.
కార్యదర్శి ఎండి షాకీర్. మాజీ సర్పంచ్ అనంగాల యాదయ్య మాజీ గ్రామ అధ్యక్షుడు కొంగర వెంకటరెడ్డి, వార్డు సభ్యులు పంబలి శివకుమార్ నూకం మమత మల్లేష్ పార్టీ సీనియర్ నాయకులు   సాతిరీ ఎల్లయ్య, జంగా చారి, లోకం జంగయ్య, కాసుల పాండు, బాలరాజ్, రపిక్, శేఖర్, సిద్ధ గొని రమేష్, పొలమొని అనిల్ రాజ్, ఎండి జాంగిర్, ఎండి ఆశ్రప్, తదితరులు పాల్గొన్నారు.


**తుర్కయంజాల్ లో తెలుగుదేశం ఆవిర్భావ ఆవిర్భావ దినోత్సవం  ఘనంగా జరిగింది**

అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో తుర్కయంజాల్ మున్సిపాలిటీలో తెలుగుదేశం  జెండా41వ ఆవిర్భవ దినోత్సవం మున్సిపల్ అధ్యక్షుడు రావుల వీరేశం జెండా ఆవిష్కరించి తద్  అనంతరం వీరేశం మాట్లాడుతూ
తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ ఘనంగా నిర్వహించి పేద ప్రజల కోసం
తెలుగు జాతికే వన్నెతెచ్చిన నందమూరి తారక రామారావు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కిందని బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా నిలిచి జెండాను అందించిన నందమూరి తారక రామారావు స్థాపించిన జెండాను పట్టు విడవని విక్రమార్కుల్లా నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంద్రజి కోహెడ శ్రవణ్ కుమార్, రాధాకృష్ణ, గడ్డం దాస్ ,వెంకటేష్, శ్రీనివాసచారి, పాపయ్య, మూడవత్ రవి నాయక్ దాసుగౌడ్ పల్చం బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.