నాణ్యత లోపించకుండా రోడ్ల వేయాలి కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్ రావు
Published: Thursday November 24, 2022
మేడిపల్లి, నవంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్ రాజేంద్రనగర్లో రూ 40 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్
బండారు శ్రీవాణి వెంకట్ రావు మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. నాణ్యత లోపించకుండా రోడ్లను వేయాలని ఈ సందర్భంగా కార్పొరేటర్ కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ జిహెచ్ఎంసి అధికారులు ఏఈ శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్, రాజేంద్రనగర్ కాలనీ అధ్యక్షుడు రుద్రాల నరసింహ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.
Share this on your social network: