గోలేటి వర్క్ షాప్ లో సరిపడ ఉద్యోగులను నియమించాలి మల్రాజు శ్రీనివాసరావు

Published: Wednesday September 21, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 20 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి ఏరియా గోలేటి వర్క్ షాప్ లో తగినంత మంది ఉద్యోగులను నియమించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు  మల్రాజ్ శ్రీనివాస్ రావు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం  ఏరియా వర్క్ షాప్ లో ద్వారా సమావేశంలో మాట్లాడారు, వర్క్ షాప్ లో చాలామంది కార్మికులు పదవి విరమణ చేయడం తో  ఉన్న కార్మికుల పైన పని భారం  పడుతుందని, ముఖ్యంగా జనరల్ మజ్దూర్, ఎలక్ట్రిషన్ల, కొరత తీవ్రంగా ఉందని, ఫలితంగా పనులు సరిగా సాగడం లేదని అన్నారు, వెంటనే ఆయా డెసిగ్నేషన్లకు సరిపడ కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు.
కార్మికులకు రావలసిన లాభాల వాటా డబ్బులను వచ్చే నెలలో చెల్లించ డానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంగం ప్రచార కార్యదర్శి ప్రకాశరావు, 11 మెన్ కమిటీ సభ్యులు మంగిలాల్,  ఏరియా అదనపు కార్యదర్శి కుమారస్వామి, ఫిట్ కార్యదర్శి రాజేశం, అదనపు ఫిట్ కార్యదర్శి చంద్రయ్య, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు లక్ష్మీనారాయణ దాస్, కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.