జడ్పీ కో-అప్సన్ సభ్యునిగా షేక్ అంజాద్ ను ప్రకటించిన - జిల్లా కలెక్టర్ రవి

Published: Monday July 19, 2021
జగిత్యాల, జులై 18 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ కో-ఆప్షన్ సభ్యునిగా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామానికి చెందిన షేక్ అంజాద్ ఎన్నికయ్యారు. జిల్లా ప్రజా పరిషత్ సభ్యునిగా నామినేషన్ దాఖలు చేయడంతో ఒకే ఒక నామినేషన్ రావడంతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి గుగులోత్ రవి షేక్ అంజద్ ను కో-ఆప్షన్ సభ్యునిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ జిల్లా ప్రజా పరిషత్ సభ్యులు అధికారులు నాయకులు పాల్గొన్నారు.