ఆర్థిక సాయం అందజేత

Published: Friday November 04, 2022
జన్నారం, నవంబర్ 02, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన బుర్ర గడ్డ రక్షిత్(12) ఇటీవల జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల్ గోవిందుపల్లి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బూరగడ్డ రక్షిత్ కు రెండు కాళ్ళు విరిగిపోవడంతో ఆస్పత్రి ఖర్చులకు 10 లక్షలు వరకు ఖర్చు అవుతాయని వైద్యులు తెలిపారన్నారు. రక్షిత్ చిన్నతనంలో తండ్రిని కూడ కొల్పయడని, గురువారం ఆ బీద కుటుంబమునకు మెరుగు సత్యగౌడ్ ఎరుకల రాజుగౌడ్ ఆధ్వర్యంలో 25,000 వేల  రూపాయలు ఆర్థిక సహాయం బాధిత కుటుంబానికీ అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.