బెల్లంపల్లిలో మొక్కలు పంపిణీ చేసిన మున్సిపల్ అధికారులు

Published: Saturday August 06, 2022

బెల్లంపల్లి ఆగస్టు 5 ప్రజాపాలన ప్రతినిధి:హరితహారం కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి మున్సిపాలిటీ లోని 24వ వార్డు రడగంబాల బస్తీ లో శుక్రవారం "డ్రై" డే సందర్భంగా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు,హరిత హారంలో భాగంగా వార్డు నెంబర్ .24 లో ఇంటింటికి మొక్కల పంపిణి చేయడంతో పాటుపురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు అనుసరించి, ఫ్రేడే - డ్రైడే కార్యక్రమములో బాగంగా సీజనల్ వ్యాధుల నివారణ మరియు నియంత్రణ ఫై స్థానిక ప్రజలకు అవగాహన కలిపించడం జరిగిందినీ, డ్రైనేజిలలో,పైన బ్లీచింగ్ పౌడర్ చల్లించామని, దోమలు వృద్ధి చెందకుండా, నిల్వ ఉన్న వర్షపు నీటిలో మరియు గుంతలలో ఆయిల్ బాల్స్ వేయించామని మరియు ఫాగింగ్ చేయించామని తెలిపారు.

ఈ కార్యక్రమము లో చైర్ పర్సన్ జక్కుల శ్వేతా, మరియు ,సంబంధిత వార్డు కౌన్సిలర్ దామెర శ్రీనివాస్, వార్డు అధికారి శ్రీకాంత్ . శానిటరీ ఇన్స్పెక్టర్ రాజ శేఖర్,జవాను . శ్రీనివాస్.టి ఎమ్.సి. దుర్గయ్య మరియు సి ఓ రామకృష్ణ, ఆర్ పి మాధవి . తదితర సభ్యులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.