గణపయ్యకు ఘనంగా వీడ్కోలు నీలం పద్మ

Published: Monday September 20, 2021
యాదాద్రి జిల్లా 19 సెప్టెంబర్ ప్రజాపాలన: ఘనంగా బొజ్జ గణపయ్యకు నిమజ్జనం చేసిన భక్తులు. ఆలేరు లో నీలం పద్మ వెంకటస్వామి దంపతులు ఘననాధునికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలేరు లోని ఇతర మండపాలలో భక్తులు భక్తి శ్రద్ధలతో తమ తమ స్తోమతను బట్టి వినాయక మండపాలలో కొలువైన ఏకదంతాయ నమః అంటూ ఘనంగా పూజలు నిర్వహించి చివరి రోజైన ఆదివారం నాడు వినాయకుని ప్రతిమలను దగ్గరలోని చెరువు కుంటల్లో నిమజ్జనం చేసినారు. భక్తులకు ఎలాంటి విఘ్నాలు కలగ కుండా చూడాలని మల్లీ వచ్చే చవితి వరకు సెలవంటూ గణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు.