మానవ సేవే మాధవ సేవా..

Published: Monday February 13, 2023
సర్పంచ్ శీలం కోటారెడ్డి
తల్లాడ, ఫిబ్రవరి 12 (ప్రజా పాలన న్యూస్) 
 తల్లాడ మండలం రామనుజవరం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు  బొగ్గుల రామకృష్ణ రెడ్డి- వెంకట్రావమ్మ దంపతులు వివాహా దినోత్సవ సందర్భంగా  ఏన్కూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామంలో గిరిజన గుత్తికోయలకు దోమల బెడదనుండి ఆ గ్రామ ప్రజలుకు  విముక్తి కల్పించడం కోసం దోమ తెరలను  60 కుటుంబాలకు 150 దోమ తెరలు,గర్భిణీ బాలింతలకు పల్లీలు, బెల్లం, పప్పు చెక్కులు, స్వీట్లు,భూoదీ,చిన్నారులకు కేకులు ,చాక్లెట్లు, సుంన్నుoడలు,పలు రకాల తిను బండారాలు రామనుజవరం సర్పంచ్ శీలం కోటరెడ్డి చేతుల మీదుగా గిరిజన గుత్తి కోయలకు పంపిణీ చేశారు..
ఈ సందర్భంగా సర్పంచ్ శీలం కోటరెడ్డి మాట్లాడుతూ  నిరుపేద గుత్తి కోయలకు బొగ్గుల రామకృష్ణ రెడ్డి -వెంకట్రావమ్మ దంపతులు వారి పెళ్లిరోజుని పురస్కరించుకుని  దోమ తెరలను బహుకరించడం ఆనందదాయకంగా ఉందని,ప్రతి ఒక్కరూ సమాజానికి తమ వంతు సహకారం అందించాలని,ఆయన అన్నారు..
ఈ కార్యక్రమంలో రామనుజవరం మాజీ ఉప సర్పంచ్ యన్నం శ్రీనివాస రెడ్డి ,,మా రత్తమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ,, నిర్వాహకులు, ఎన్ జీవో ఇశ్నపల్లి శ్రీనివాస్  పాల్గొన్నారు.