అణగారిన వర్గాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్

Published: Tuesday April 06, 2021
-బిజెపి సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్
 
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధి మసీద్బండలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ అనగారిన వర్గాల అభ్యున్నతికి ఎన్నో పోరాటాలు చేసిన యోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్. ఆయన చేసిన పోరాటాలు ఇప్పటి తరానికి కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయనడం అతిశయోక్తి కాదన్నారు. ఆనాటి సమాజంలో చదువుకు దూరమై జీవితానికి అడుగుతున్నా పీడిత దళిత దిన జనుల కోసం జీవితాంతం ప్రేమించినా యోధుడు బాబు జగ్జీవన్ రామ్. అందరితోనూ ఆప్యాయంగా బాపూజీ అని పిలిపించుకున్న ఆయన నడిచిన బాట. అనుసరించిన ఆదర్శాలు చూపిన సంస్కరణను మార్గాలను గుర్తు చేసుకుంటూ ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శప్రాయంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రవి కుమార్ యాదవ్ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వినోద్ రావు, రాధా కృష్ణ యాదవ్, ఎల్లేష్, రాజు శెట్టి,  లక్ష్మీనారాయణ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, మల్లేష్ గౌడ్, వినోద్ యాదవ్, నరసింహ, బాల కుమార్, భరత్ కుమార్, సతీష్ కురుమ మొదలగు వారు పాల్గొన్నారు.