ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి *కిడ్డి బ్యాంకులో దాచుకున్న డబ్బులతో నోట్ పుస

Published: Tuesday January 03, 2023
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి పిలుపుకు స్పందించి ఓ విద్యార్థి  తాను దాచుకున్న డబ్బులతో నోట్ పుస్తకాలు కొని మంత్రికి అందించి గొప్ప మనసు చాటుకున్నారు.శంకర్ పల్లి రేవతి పాఠశాలలో 5 వ తరగతి చదువుతున్న జిలాని కుమారుడు ఎండి అసద్ కిడ్డి బ్యాంకు లో దాచుకున్న 1500 రూపాయలతో నోట్ పుస్తకాలను కొని సోమవారం నాడు శ్రీనగర్ కాలనీలోని  నివాసంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి చిన్నారి విద్యార్థి అసద్ ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే  విద్యార్థుల కోసం తాను ఇచ్చిన పిలుపుకు స్పందించి 5 వ తరగతి విద్యార్థి ముందుకురావటం ఎంతో గొప్ప విషయం అని,ప్రతి ఒక్కరు ప్రతి    సందర్భంలో  బొకేలు,శాలువాలకు బదులు విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు.తనతో పాటు ఎవరిని కలిసిన నోట్ పుస్తకాలు, బ్యాగులు,వాటర్ బాటిళ్లు,పెన్నులు, పెన్సిళ్లు, అంగన్ వాడి పిల్లలకు మ్యాట్లు అందించాలన్నారు.