ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును అభినందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Published: Thursday September 23, 2021
కోరుట్ల, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా నియమితులైన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మంగళవారం ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, తెలంగాణ నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు ఎమ్మెల్సీ కవిత సూచించారు.
Share this on your social network: