నిరుపేదల కుటుంబానికి నిమ్స్ ఆసుపత్రి కి ఎల్.ఒ.సి : మంత్రి కొప్పుల ఈశ్వర్.

Published: Thursday October 14, 2021
వెల్గటూర్, అక్టోబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం కప్పారావు పేట గ్రామానికి చెందిన తరాల్ల అజిత్ కుమార్ గత కొన్ని నెలలుగా బోన్ క్యాన్సర్ బాధపడుతూ వైద్యం చేసుకో నీ పరిస్థితిలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలవడం జరిగింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని, నిమ్స్ ఆసుపత్రి నుండి 1లక్ష రూపాయల ఎల్.ఒ.సి ని అజిత్ కు మంత్రి కొప్పుల ఈశ్వర్ అందించారు. ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.