దైవ సంకల్పమే కార్యోన్ముఖుల్ని చేస్తుంది

Published: Monday January 31, 2022
జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్ బ్యూరో 30 జనవరి ప్రజాపాలన : దైవ సంకల్పం ఉంటే కాగల కార్యం తప్పక నెరవేరుతుందని జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించకొని జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులుగా అధిష్టానం నియమించిన సందర్భాన్ని పురస్కరించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ పార్టీని నమ్మి శక్తి వంచన లేకుండా కృషి చేసినవారికి తగిన సమయంలో గుర్తింపు లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ పరంగా ఏ పదవి అప్పగించిన ఆ పదవికి న్యాయం చేసే విధంగా పని చేస్తే తప్పక గుర్తింపు లభిస్తుందని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తగా సేవలు మొదలుపెట్టి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్తను సమన్వయపరుస్తూ అనుసంధాన కర్తగా వ్యవహరిస్తూ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడపగడపకు చేర్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనం చేసే పనికి దైవ సంకల్పం తోడుంటే అనుకున్నది సాధిస్తామని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్ల పల్లి రమేష్ కుమార్ వికారాబాద్ ఏఎంసీ వైస్ చైర్మన్ మేక చంద్రశేఖర్ రెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ పాప గారి విజయ్ కుమార్ కౌన్సిలర్లు చిట్యాల అనంత రెడ్డి మల్లేపల్లి నవీన్ కుమార్ కొండేటి కృష్ణ చింతకింది రామస్వామి హీరే కార్ సురేష్ ధారూర్ ఏఎంసీ చైర్మన్ ముచ్చర్ల సంతోష్ కుమార్ గుప్తా ఆధారాలు టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కోస్నం వేణుగోపాల్ రెడ్డి రొంపల్లి ఎంపీటీసీ శ్రీకాంత్ రెడ్డి దశరథ్ గౌడ్ టిఆర్ఎస్ యువ నాయకులు కైలా ఉపేందర్రెడ్డి సుభాన్ రెడ్డి హరితేజ ముదిరాజ్ ప్యాట గిరీష్ కొటారి ఆలూరి రమణ మాలే లక్ష్మణ్ గుప్తా పలుగుట్ట కృష్ణ శ్రీనివాస్ గౌడ్ తదితర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.