మహిళలపై బీజేపీ కార్యకర్తల దాడి హేయమైన చర్య : తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ గ

Published: Wednesday August 24, 2022

ఎం ఎల్ సి కవిత ను కలవడానికి వచ్చిన తమ మహిళా కార్యకర్తలపై బి జె పి కార్యకర్తలు అకారణంగా  దాడి చేశారన్నారు తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్....మోతి నగర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న టి ఆర్ ఎస్ మహిళా కార్యకర్తలు కృష్ణవేణి, స్వాతి లను టి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు రాజారాం యాదవ్, గంధం రాములు, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియొద్దీన్ లతో కలిసి  పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వజ్రోత్సవ ముగింపు కార్యక్రమం లో తామందరము ఉన్న సమయంలో ఎం ఎల్ సి కవిత ఇంటిపై బీజేపీ గుండాలు మారణాయుధాలతో ఆమె కుటుంబ సభ్యులపైకి దాడి చేయడానికి వచ్చారని ఆ సమయంలో ఎం ఎల్ సి కవిత ను కలవడానికి వచ్చిన తమ మహిళా కార్యకర్తలపై బి జె పి కార్యకర్తలు దాడి చేశారన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ మహిళా కార్యకర్తలను బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియొద్దీన్ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారన్నారు.ఈ సందర్బంగా ఎం ఎల్ సి కవిత గాయపడ్డ టి ఆర్ ఎస్ మహిళా కార్యకర్తలను ఫోన్ లో పరామర్శించారు. రాజారాం యాదవ్ మాట్లాడుతూ ఎం ఎల్ సి కవిత ను కలవడానికి వచ్చిన వారిపై బీజేపీ గుండాలు దాడి చేయడం అన్యాయం అన్నారు. బండి సంజయ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ నాయకురాలు కవిత కు అండగా తామందరం ఉంటామన్నారు.ఈ కార్యక్రమం లో స్థానిక టి ఆర్ ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.