దారా విష్ణు మోహన్ రావు వివాహ వార్షికోత్సవం..

Published: Wednesday March 01, 2023
తల్లాడ, ఫిబ్రవరి 28 (ప్రజా పాలన న్యూస్):
తల్లాడ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దారా విష్ణు మోహన్ రావు, రాజ్యలక్ష్మి దంపతుల 48వ వివాహ వార్షికోత్సవం మంగళవారం అన్నారుగూడెం గ్రామంలోని సాయిబాబా ఆలయంలో నిర్వహించారు. తన స్నేహితుడు, సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ మారెళ్ళ లక్ష్మణ్ రావు, విష్ణు మోహన్ రావు ఇద్దరు మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలో ఇరువురుది కూడా స్వగ్రామం అన్నారుగూడెం కావడంతో ఆలయ వార్షికోత్సవానికి వచ్చిన ఆ దంపతులకు ఆయన శాలువాలు, పూలమాలతో సన్మానించి సత్కరించారు. అనంతరం విష్ణు మోహన్ రావు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిని, పుట్టిన గడ్డని మరవకూడదని, ఈ ప్రాంత ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు ఎప్పటికీ మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత, నాయకులు తుమ్మలపల్లి రమేష్, ఆలయ కమిటీ సభ్యులు పాపినేని మదనయ్య, పూనాటి సత్యం, నున్నా సాందీపులు, ఆపతి రామారావు, వెంకటేశ్వరరావు, దుగ్గినేని గోపయ్య, తదితరులు పాల్గొన్నారు.*