రాష్ట్ర ముఖ్య కార్యవర్గ సమావేశానికి కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్క్ మార్ చాహార్ రాష
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 26 ప్రజాపాలన ప్రతినిధి.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపల్ పరిధిలో బొంగుళూరు గేట్ రేపు ఉదయం పది గంటలకు పి ఎస్ జి కన్వెన్షన్ హల్ లో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అధ్యక్షత న ప్రారంభం కానున్న బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ముఖ్య అతిధులుగా రానున్న కిసాన్ మోర్చా జాతీయ అద్యక్షులు రాజ్కుమార్ చాహార్ ఎంపీ , బీజేపీ రాష్ట్ర శాఖ అద్యక్షులు బండి సంజయ్ కుమార్
కేసీఆర్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల పై చర్చించనున్న కార్యవర్గం
ప్రధానంగా లక్ష రూపాయల ఋణ మాఫీ హామీ అమలుకు ఉద్యమాన్ని ఉధృతం చేసే యోచన
తెలంగాణ లో ప్రధాన మంత్రి పసల్ బీమా అమలు చేయకపోవడం వల్ల రైతులకు జరుగుతున్న నష్టం పై ఉద్యమ కార్యాచరణ
ధరణి తో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పై చర్చ
కార్యవర్గ సమావేశం ప్రాంగణాన్ని పరిశీలించి న బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలంగాణ ఇంచార్జి సురేష్ రెడ్డి పాపయ్య గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శలు అంజయ్య యాదవ్ పడమటి జగన్మోహన్ రెడ్డి , నరసింహ రెడ్డి నిరంజన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్క రవీందర్ రెడ్డి మోర నరసింహ రెడ్డి
Share this on your social network: