ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ

Published: Saturday May 08, 2021
మేడిపల్లి, మే7 (ప్రజాపాలన ప్రతినిధి) : రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందిస్తున్న రంజాన్ కానుకలను ఉప్పల్ డివిజన్లోని మహమ్మదీయ మసీదులో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మందుముల్ల రజిత పరమేశ్వర్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగలను మతసామరస్యంతో జరుపుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే సుభాస్ రెడ్డి, కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.