ఘనంగా ఖమ్మం మాజి పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనన్న పుట్టిన రోజు వేడుకలు

Published: Friday October 29, 2021
మధిర, అక్టోబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలో ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అంబేద్కర్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన కేకును మహిళలు కట్ చేసి శ్రీనన్న నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి, భవిష్యత్తులో రాజకీయంగా అత్యున్నత స్థానంలో శ్రీనన్న ఉండాలని అందరూ కోరారు. అనంతరం మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల నాయకులు మధిర పురవీధులలో శ్రీనన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో మెయిన్ రోడ్ మీదుగా ఫ్లైఓవర్ ఎక్కి RV complex మీదుగా రెడ్డి గార్డెన్స్ వరకు భారీ బైక్ ర్యాలీగా చేరుకున్నారు. రెడ్డి గార్డెన్స్ నందు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు ఘనంగా ప్రారంబించారు. దాదాపు 200 మంది రక్తదానం చేసి శ్రీనన్న మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం రెడ్డి గార్డెన్స్ నందు డా. కోట రాంబాబు ఆధ్వర్యంలో కేకు కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ విదంగా శ్రీనన్న పుట్టిన రోజు సంబరాలు అంబరాన్ని అంటాయి ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు, నాయకులు అయిలూరి వెంకటేశ్వర రెడ్డి, యన్నం కోటేశ్వరరావు, లక్ష్మారెడ్డి సీతారామి రెడ్డి, దేవిశెట్టి రంగా మొండితోక సుధాకర్ శీలం కవిత మల్లిఖార్జున రెడ్డి, టి.వి.రెడ్డి, రామరాజు యర్రగుంట రమేష్ యర్రగుంట లక్ష్మీ, అప్పారావు వెంకట్రామిరెడ్డి, యన్నం రజిని ఉమ త్రివేణి రు, భార్గవి, ఉమ్మినేని కృష్ణ, తోటకూర వెంకటేశ్వర రావు కోయినేని ప్రదీప్, బోయినపల్లి మురళీ, ఏలియేలు అక్కినపల్లి నాగేశ్వరరావు కంభం శివ తదితరులు పాల్గొన్నారు...